ఇందల్వాయి,బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా తొలిసారిగా రావడంతో నిజామాబాద్ క్యాంప్ ఆఫీస్ లో మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు. అనంతరం మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి మంత్రి సీతక్క దృష్టికి ముదిరాజుల పట్ల ప్రభుత్వపరంగా అన్ని విధాల కృషి చేయాలని కోరారు. అలాగే రిజర్వేషన్లలో సైతం తమకు న్యాయం చేయాలని కోరారు.మంత్రి సీతక్క మాట్లాడుతూ సత్వరమే ముదిరాజులకు రానున్న రోజులలో మంచి అవకాశాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.
