బిచ్కందు, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల మాజీ ఎంపీపీ అశోక్ పటేల్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. బుధవారం రాత్రి తీవ్ర అస్వస్థకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అశోక్ పటేల్ మరణంతో ఆయన అభిమానుల్లో విషాదఛాయలు అములుకున్నాయి. పార్టీ శ్రేణుల్లో కీలక నేత మృతి విషాదం నింపింది.
