ఎల్లారెడ్డి, బతుకమ్మ : భారీ వర్షాలతో అతలాకుతలం అయిన ఎల్లారెడ్డి, నిజాంసాగర్ మండలాలలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా విపత్తు వలన నష్ట పోయిన రైతులను కలిసి ధైర్యం చెప్పారు. విపత్తు జరిగిన పరిసర ప్రాంతాలలో పర్యటించి రైతులకు అండగా మేమున్నాం అని భరోసా కల్పించారు. ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్ట పోయిన రైతులకు ఎకరాకు లక్ష రూపాయల సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
