ఇందూర్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జండా బాలాజి మందిరంలో ఎంతో వైభవంగా జరిగే జండా జాతర సందర్భంగా జండాపూజ కార్యక్రమం శనివారం ప్రారంభించారు. జండా జాతర ఉత్సవములు -2026 శనివారం నుండి 26వ తేది వరకు జరుగుతుందన్నారు. శనివారం జాతర ప్రారంభ కార్యక్రమము శ్రీ స్వామి వారి జండా పూజ జండా ముత్తవల్లి అజయ్ సంగ్వాయ్ స్వగృహం పెద్ద బజార్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి ఆంజనేయులు, ముత్తవల్లి అజయ్ సంగ్వాయ్ కుటుంబ సభ్యులు, జాలిగం గోపాల్, లవంగ ప్రమోద్, మోర సాయిలు, నర్సింగ్ రావ్, బ్రాహ్మణ సమాజ పెద్దలు, భక్తులు నగర వాస్తవ్యులు పాల్గొన్నారు.

