నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నిజామాబాద్ నగరంలో బస్ స్టాండ్ వద్ధ గల సాయి మెస్ టిఫిన్ సెంటర్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం టిఫిన్ సెంటర్ కిచెన్ లో మంటలు అంటుకున్నాయి. అ సమయంలో కస్టమర్లు లేకపోవడం ప్రమాధం తప్పింది. టిఫిన్ సెంటర్ , కిచెన్ ఇరుకు ప్రాంతంలో ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో పైరింజన్ లు వచ్చి మంటలను అర్పుతున్నాయి. పక్కనే ఉన్న మరో టిఫిన్ సెంటర్ ను మూసివేశారు. ఆగ్నీ ప్రమాధం కు గల కారణాలు తెలియ రాలేదు. సాయి టిఫిన్ సెంటర్ పైన మెస్ తో పాటు, లాడ్జీ వసతి ఉండటంతో అక్కడ ఉన్న వారిని ఖాళీ చేయించారు. ప్రమాధం జరిగిప్పుడు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.

