నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: దుబ్బా గవర్నమెంట్ హై స్కూల్ గెజిటెడ్ హెచ్ఎం, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు జె.గంగయ్య మంగళవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సంఘాల నేతలు ఆయనను ఘనంగా సన్మానించారు. గంగయ్య చేసిన సేవలను గుర్తు చేసుకుని ఘనంగా వీడ్కోలు పలికారు. స్టేట్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జె.గంగయ్య దంపతులకు శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ టీచర్స్ యూనియన్ అద్యక్షులు ధర్మేందర్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, సీనియర్ రాష్ట్ర నాయకులు బాలచంద్రం, జిల్లా నాయకులు టి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.