28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

గిరిజన తండాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని కిష్ట నాయక్ తండా,అల్మాస్పూర్ తండా, బుగ్గ రాజేశ్వర తండాలలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి 300 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి, 20 కిలోల బెల్లంను, 10 కిలోల పటిక 20 లీటర్ల గుడుంబా స్వాధీనము చేసుకున్నట్లు ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సి ఐ శ్రీనివాస్ తెలిపారు.ఈ దాడుల్లో మూడు కేసుల నమోదు చేసి నలుగురు వ్యక్తులను అరెస్టు చేశామని ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఈ దాడులలో డి టి ఎఫ్ ఎస్ ఐ శైలజ,  సిబ్బంది రాజు, కిషోర్, మల్లేష్ ,వర్మ ,హమీద్, సుమన్ ,రాకేష్ లు పాల్గొన్నారు .గ్రామాలలో నాటు సారా,దానితయారికి సంబంధించిన ముడి సరుకులు ఎవరైనా కలిగి ఉన్నట్లయితే తమకు సమాచారం ఇవ్వాలనీ ఎక్సైజ్  సి ఐ తెలిపారు.

More articles

Latest article