బతుకమ్మ,మోర్తాడ్: టీబీ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరి తమవంతుగా కృషి చేయాలని ఏఎన్ఎం సద్గుణ అన్నారు. ప్రపంచ టి బి వ్యాది నివారణ దినోత్సవం సందర్భంగా మోర్తాడ్ మండలంలోని శేట్ పల్లీ గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం టి బి వ్యాది నివారణకు సంబంధించి అవగాహన కల్పించారు. ప్రభుత్వం పంపిణీ చేసే మందుల గురించి తెలుపుతూ టి బి నివారణకు కొరకు తమ వంతు కృషి చేస్తామని ఆధ్వర్యంలో గ్రామస్తులు, అధికారులు ప్రతిజ్ఞ చేయడం జరిగింది. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, కారోబార్ పృథ్వీరాజ్, పంచాయతీ సిబ్బంది రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.