24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఉపాధిహామీ కూలీలకు పని ప్రదేశాల్లో సౌకరర్యాలు కల్పించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎంపీడిఓ బాల గంగాధర్

 

రుద్రూర్, బతుకమ్మ :

 

ఉపాధిహామీ పనుల వద్ద ఉపాధిహామీ కూలీలకు అన్నీ సౌకర్యాలు కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలనీ ఎంపీడిఓ బాల గంగాధర్ సూచించారు. రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి గ్రామంలో గల చెరువు వద్ద ఉపాధిహామీ పనులను బుధవారం ఎంపిడిఓ బాల గంగాధర్, ఏపీఓ రాజేశ్వర్ లు తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఉపాధిహామీ కూలీలతో మాట్లాడుతూ.. వేసవికాలం ఉన్నందున ఉదయం 6 గంటలకు పనులకు హాజరుకావాలని సూచించారు. అదేవిధంగా ఉపాధిహామీ పనులకు వచ్చేటప్పుడు గొడుగులను వెంట తీసుకురావాలన్నారు. గొడుగుల వలన ఎండ నుండి రక్షణ ఉంటుందని సూచించారు. అదేవిధంగా ఉపాధిహామీ పనుల వద్ద అన్నీ సౌకర్యాలు ఉండేవిధంగా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మచ్కురి రమేష్, ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధిహామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article