బిచ్కుంద, బతుకమ్మ :
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ బిచ్కుంద శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నూతన కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులు స్టేట్ ఖేల్ కన్వీనర్ చరణ్ మాట్లాడుతూ నిరంతరం విద్యారంగా సమస్యల కై పోరాడుతు జాతీయ పునర్నిర్మాణమే ధ్యేయంగా పనిచేస్తున్న సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రమే అని అన్నారు. అనంతరం నగర అధ్యక్షులు గా ముప్పిడి వెంకట్, నగర కార్యదర్శి గా నాగరాజ్, ఎస్ఎఫ్డి కన్వీనర్ గా సందీప్, ఎస్ఎఫ్ఎస్ కన్వీనర్ గా గణేష్, మహిళా కన్వీనర్ గా సంతోషి రనీ, ఉపాధ్యక్షులు గా రాహుల్, బాలరాజ్, సంయుక్త కార్యదర్శులుగా శ్రీకాంత్, ఆనంద్, మహిళా కో కన్వీనర్ గా సన, ప్రియాంక, స్పోర్ట్స్ ఇన్ చార్జి గా సన్నీ, విద్యార్ధి శక్తి గా ఆకాష్, ప్రేరణ ఇన్ చార్జి గా మహేందర్ లను ప్రకటించారు.
