నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:
నగరంలోనో 45వ డివిజన్ లో బీజేపీ బూత్ కమిటీలను ఎన్నుకున్నారు. ఆదివారం 45వ డివిజన్ లో జరిగిన బూత్ కమిటీ సమావేశంలో 35, 52, నంబర్ బూత్ లకు అధ్యక్ష, కార్యదర్శులు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తారక్ వేను హాజరయ్యారు. శక్తి కేంద్రం ఇన్ చార్జ్ బొబ్బిలి వేణు ఆధ్వర్యంలో బూత్ కమిటీల ఎన్నిక నిర్వహించారు. అనంతరం బూత్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు, కమిటీ సభ్యులను బొబ్బిలి వేణు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి 45 డివిజన్ బిజెపి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
