చార్జీ షీట్ గాంధీ కుటుంబంపై తొలిసారి..
నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం
వెబ్ న్యూస్, బతుకమ్మ: నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈకేసుకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ,పలువురు కాంగ్రెస్ నేతలపై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఏజేఎల్ కు సంబంధించిన రూ.700 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. కాంగ్రెస్ నేతలపై రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ ఫిర్యాదు చేసింది. ఈమేరకు ఈనెల 25 న వాదనలు జరగనున్నాయి. గాంధీ కుటుంబంపై తొలిసారిగా చార్జీ షీట్ దాఖలు కావడం విశేషం. కాంగ్రెస్ నేత , ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ను ఈడీ విచారించిన కొన్నిగంటల్లోనే ఈపరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.
