బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ పట్టణంలోని పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని సోమవారం డీఎస్పీ విట్టల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకున్నామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యా అధికారి నాగేశ్వర్ రావు, పట్టణ సీఐ తుల శ్రీధర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
