నిజామాబాద్, బతుకమ్మ : ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రం నర్సింగ్ పల్లిలో సోమవారం స్వర్ణామృత ప్రాశన మందు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన ధర్మకర్త నర్సింహారెడ్డి మాట్లాడుతూ ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున ఈ ఔషధాన్ని అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 15 సంవత్సరాల వయసు వచ్చేవరకు ఇస్తూ పంపిణీ చేస్తామన్నారు . వరుసగా 21 నెలలు ఈ ఔషధాన్ని తీసుకున్న బిడ్డలకు ఎటువంటి రుగ్మతలు రావని, ఏదైనా వ్యాధులు ఉన్న అవి దూరం అవుతాయని, పిల్లల శారీర దారుఢ్యం పెరిగిపోయి రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. గత పది సంవత్సరాలుగా కొన్ని లక్షల మందికి ఈ ఔషధాన్ని వేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు రోహిత్ కుమారాచార్య, నరాల సుధాకర్, రమేష్, మారుతి తదితరులు పాల్గొన్నారు.
