ధర్పల్లి, బతుకమ్మ: ధర్పల్లి మండల కేంద్రంలోని పాత గురడి రెడ్డి సంఘంలో కళ్యాణ లక్ష్మి షాదీ,ముబారక్ చెక్కులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్. ఆర్.భూపతిరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ్ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం వల్ల పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు కూడా పక్కగా అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్పల్లి తాహాసిల్దార్ బి.మాలతి, ధర్పల్లి మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేందర్, సిరికొండ మండల అధ్యక్షులు బాకారం రవి, ఇందల్వాయి మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు చేలిమెల శ్రీనివాస్,అధికారులు,వివిధ గ్రామాల కార్యకర్తలు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
