బతుకమ్మ, ఏర్గట్ల : ప్రభుత్వ విద్యార్థులకు రెండవ దఫా కింద పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం రోజున ఏర్గట్ల మండల ఎంఈఓ ఆనంద్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్లు, పిఆర్టియు మండల అధ్యక్షుడు,కృష్ణ ప్రసాద్, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు. ఎంఈఓ మాట్లాడుతూ మండల పరిధిలోని స్కూల్ విద్యార్థులు సమయానికి పుస్తకాలు అందుకుని పాఠశాల పట్ల ఆసక్తి పెంచుకోవాలని సూచించారు.
