భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని పురాణీపేట్ గ్రామానికి చెందిన లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిది ద్వారా మంజూరైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను శుక్రవారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు శిరం అనుసాగర్ చేతుల మీదగా లబ్దిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, మంజూరుకు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి శ్రీ ముత్యాల సునీల్ కుమార్ కు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తోట శ్రీనివాస్, దైడి.సురేష్, తోట.శివక్రాంతి, యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు తోట. గణేష్, తోట.హరీష్, మగ్గిడి. గంగాధర్,అక్కం.గంగాధర్,ఒడ్డెమ్.శ్రీనివాస్,మొండి.రమేష్, అశోక్, మహమ్మద్ దానిష్, తదితరులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
