27.5 C
Hyderabad
Friday, July 31, 2026

క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వం విజయానికి మూలం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ

 

. . . నిజామాబాద్ లో ‘రెసోనెన్స్ ఫౌండేషన్ సెంటర్’ ప్రారంభం

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వం విజయానికి మూలమని మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. దేశంలో ఐఐటీ-జేఈఈ, నీట్ శిక్షణలో అగ్రగామిగా ఉన్న రెసోనెన్స్ విద్యాసంస్థలు నిజామాబాద్ లో ఉన్న హోటల్ వంశీ ఇంటర్నేషనల్ వేదికగా ‘రెసోనెన్స్ ఫౌండేషన్ సెంటర్’ను ప్రారంభించింది. మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే బలమైన విద్యా పునాది నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నిజామాబాదులో ఫౌండేషన్ కోచింగ్‌ను అందుబాటులోకి తీసుకు వస్తున్న రెసోనెన్స్ విద్యా సంస్థలను అభినందించారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా రెసోనెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు నర్రా మాట్లాడుతూ అనుభవజ్ఞులైన అధ్యాపకులు, క్రమబద్ధమైన బోధనా పద్ధతులు, నిరంతర విద్యా పర్యవేక్షణతో ఫలితాల ఆధారిత విద్యను అందించడానికి రెసోనెన్స్ కట్టుబడి ఉందన్నారు. ఈ ఫౌండేషన్ సెంటర్ విద్యార్థులకు ప్రాథమికాంశాలను బలోపేతం చేసుకోవడానికి, ఐఐటీ-జేఈఈ, నీట్, ఒలింపియాడ్స్ వంటి పోటీ పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమవడానికి సహాయపడుతుందని తెలిపారు. అనంతరం నిర్వహించిన అవగాహన సదస్సులో‌ ప్రారంభ దశలోనే ప్రిపరేషన్ మొదలుపెట్టడం, సంపూర్ణ అవగాహనతో కూడిన అభ్యాసం, కెరీర్ ఆధారిత విద్యా ప్రణాళిక ప్రాముఖ్యతను వివరించారు.

. . . రెసోనెన్స్ విద్యాసంస్థలు, తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ గురించి

రెసోనెన్స్ అనేది ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి ఆర్కే వర్మ 2001లో రాజస్థాన్‌లోని కోటాలో స్థాపించారు. ఇది దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక ప్రతిష్టాత్మక విద్యాసంస్థ. గత రెండు దశాబ్దాలుగా రెసోనెన్స్ 87 నగరాల్లోని 150 పైగా కేంద్రాల ద్వారా 10 లక్షల (1 మిలియన్) పైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది. ఇందులో 3.3 లక్షల పైగా విద్యార్థులు ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ప్రముఖ సాంకేతిక విశ్వవిద్యాలయాలు, టాప్ మెడికల్ కాలేజీలలో ప్రవేశాలు పొందారు. దేశవ్యాప్తంగా ఉన్న ఈ బలమైన వారసత్వంతో, పూర్ణచంద్రరావు నర్రా దూరదృష్టి తో కూడిన నాయకత్వంలో రెసోనెన్స్ 2018లో హైదరాబాద్‌లో ఒకే ఒక్క క్యాంపస్‌తో ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఎంపీసీ, బైపీసీ గ్రూపులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ.. ఐఐటీ-జేఈఈ, నీట్, ఇతర పోటీ పరీక్షలకు సమగ్రమైన శిక్షణ, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, క్రమశిక్షణతో కూడిన ప్రిపరేషన్, ఫలితాల ఆధారిత విధానంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నిరంతర విజయాలకు, విద్యా నైపుణ్యానికి రెసోనెన్స్ విద్యాసంస్థలు ఒక చిహ్నంగా మారాయి. కేవలం ఏడు సంవత్సరాలలోనే, రెసోనెన్స్ విద్యాసంస్థలకు చెందిన 6,100 పైగా విద్యార్థులు ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఎయిమ్స్, ఇతర అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలలో సీట్లు సాధించారు. ఈ అద్భుతమైన విజయాల స్ఫూర్తితో, రెసోనెన్స్ ఇప్పుడు ఫౌండేషన్ సెంటర్లు, పాఠశాలలు, ఈ-లెర్నింగ్, గ్లోబల్ స్టడీస్ రంగాలలోకి విస్తరించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా 50 పైగా క్యాంపస్‌లతో విజయవంతంగా దూసుకుపోతోం ది. మరింత సమాచారం కోసం 9959154371, 9985310069 నెంబర్ లను సంప్రదించాలని ఆయన తెలిపారు.

 

Discipline and proper guidance are the source of success

More articles

Latest article