- డ్యూయల్ డెస్క్ లు అందజేసిన దాత
వేల్పూర్, బతుకమ్మ : మండలంలోని అంక్సాపూర్ గ్రామ జడ్పి హెచ్ ఎస్ స్కూల్ కు ప్రముఖ పారిశ్రామిక వేత్త, విద్యావేత్త ఏనుగు దయానంద్ రెడ్డి (దయరెడ్డి)20 డ్యూయల్ డెస్క్ లను విరాళంగా అందజేశారు. చిట్టాపూర్ గ్రామ వాస్తవ్యులు దయరెడ్డి ఇప్పటికి వరకు బాల్కొండ నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలకు ఇదే తరహాలో విరాళాలు అందించిన ధాత. ఈ సందర్బంగా స్కూల్ హెచ్. ఎం ఆర్. మల్లిశ్వరీ, ఉపాధ్యా బృందం,విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థిని, విద్యార్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
