రుద్రూర్, బతుకమ్మ: సంగారెడ్డి జిల్లా ఆందోల్ గ్రామానికి చెందిన రామ్ అనే యువకుడు కేదార్ నాథ్, బద్రీనాథ్ వరకు సైకిల్ యాత్ర ప్రారంభించారు. శనివారం రుద్రూర్ గ్రామం మీదుగా బోధన్, నిజామాబాద్, అక్కడి నుండి కేదార్ నాథ్, బద్రీనాథ్ వరకు సైకిల్ యాత్ర కొనసాగిస్తున్నట్లు తెలిపారు. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు దినం ప్రకటించాలని గతంలో 12 జ్యోతిర్లింగాలు, ఆరు నెలలు సైకిల్ యాత్ర చేశానని, ప్రస్తుతం కేదార్ నాథ్, బద్రీనాథ్ వరకు సైకిల్ యాత్ర చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

