నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ప్రమాదవశాత్తు కంటైనర్ లారీ సోమవారం దగ్ధమైంది. డిజీల్ ట్యాంక్ నుంచి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. హైదరాబాద్ నుంచి నాగ్ పూర్ కు కంటైనర్ లో పార్సిల్స్ తరలిస్తున్నట్లు గుర్తించారు. డ్రైవర్ కు స్వల్పగాయాలు అయ్యాయి.
