- కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్
తాడ్వాయి, బతుకమ్మ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ లబ్దిదారులకు సూచించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా తాడ్వాయి మండల కేంద్రంలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హౌసింగ్ మెజర్మెంట్ ప్రకారం మాత్రమే ఇండ్ల నిర్మాణం జరిగేలా చూడాలని, రెవిన్యూ అధికారులతో సమన్వయము చేసుకుంటూ ఉచిత ఇసుక సరఫరా కు ఇబ్బంది కలుకుండా చర్యలు తీసుకోవాలని హోసింగ్ డిప్యుటీ ఇంజనీర్ సుభాష్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, తహసిల్దార్, మండల ప్రత్యేక అధికారి పాల్గొన్నారు.
