బతుకమ్మ, ఏర్గట్ల: మండల కేంద్రం నుండి పెర్కిట్ లో జరిగే జనహిత పాదయాత్రకు ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బైకులతో ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
