ఏర్గట్ల, బతుకమ్మ :
మండల కేంద్రానికి చెందిన ఇందిరమ్మ కమిటీ సభ్యులు దొబ్బల చిన్న కిషన్, వాళ్ళ నాన్న దొబ్బల లస్మన్న, ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలిసిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆదివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్, ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోమ దేవారెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు జింక అనిల్ కుమార్ యాదవ్, బద్దం లింగారెడ్డి, పన్నాల నర్సారెడ్డి, ముస్కు మోహన్ రెడ్డి, జూంగల గణేష్, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
