మాజీ మంత్రి హరీశ్ రావు
సంగారెడ్డి, బతుకమ్మ : పాశమైలారం సిగాచి పరిశ్రమ ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు, ఆచూకీ గల్లంతైనవారికి ఇంకా పరిహారం ఇవ్వలేదని బాధితులు ఆందోళన చేపట్టారు. ప్రమాద బాధితులతో కలిసి సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్కు ర్యాలీగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తరలివెళ్లారు. ఈసందర్భంగా కలెక్టర్ తో హరీశ్ రావు మాట్లాడారు. ప్రమాద బాధితులకు పరిహారం ఇవ్వకుంటే కలెక్టరేట్ ముందు టెంట్ వేసి దీక్ష చేస్తామని, ఉద్యమం ఉధృతం చేస్తామని సంగారెడ్డి కలెక్టర్ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హెచ్చరించారు. పరిహారం వారానికి ఇస్తారా, 10 రోజులకు ఇస్తారా స్పష్టమైన తేదీ చెప్పండని ఆయన డిమాండ్ చేశారు. ప్రమాదంలో మరణించిన వారికి రూ.1 కోటి, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.
