29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

మార్కెట్ రేట్ ప్రకారం పరిహారం ఇవ్వాలి

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ , బతుకమ్మ  : హైదరాబాద్ – బోధన్ రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న తమకు ప్రస్తుత మార్కెట్ రేట్‌కు అనుగుణంగా పరిహారం చెల్లించాలని బాధితులు కోరారు. ఈ మేరకు సోమవారం బాన్సువాడలో సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతిపత్రం అందజేశారు. మహమ్మద్ నగర్ మండల కేంద్రంతోపాటు బూర్గుల్ గ్రామ శివారులో రహదారి విస్తరణ పనుల్లో భూములు కోల్పోతున్న తమకు ఎకరానికి రూ.30 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు.  ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. హైవే అధికారులు, కలెక్టర్‌తో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. వినతిపత్రం అందజేసిన వారిలో జక్సాని శ్రీనివాస్ గుప్తా, రాము, దుబ్బ నాగరాజు గుప్తా, ఎలగందుల ప్రవీణ్, చింతల సంతోష్, దుర్గ నరేశ్ తదితరులున్నారు.

More articles

Latest article