రుద్రూర్, బతుకమ్మ :
బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ద్వారా రుద్రూర్ గ్రామానికి చెందిన ఆరుగురు లబ్ధిదారులు అలీఖాన్ రూ.49,500, అమన్ హుస్సేన్ రూ.20,000, పార్వతి మల్లయ్య రూ.50,000, బైండ్ల పద్మ రూ.50,000, కాసుల పర్వవ్వ రూ.13,000, నాగం గోదావరి రూ.17,000 మొత్తం 1,99,500 మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంగళవారం కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి చెక్కులను అందజేశారు. చెక్కులను పంపిణీ చేసిన వారిలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పార్వతి ప్రవీణ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి పత్తి రాము, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అక్కపల్లి నాగేందర్, వార్డు సభ్యులు ఇమ్రాన్, కాంగ్రెస్ నాయకులు నర్సయ్య, ఖాజా, పత్తి నవీన్, ఈర్వ నాగరాజు లు ఉన్నారు.
