హైదరాబాద్, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా నియమితులైన శివప్రసాద్ శుక్లాకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. మంగళవారం ఎయిర్ పోర్టులో గవర్నర్ శివ ప్రసాద్ శుక్లాకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు, డిజిపి శివధర్ రెడ్డి, సిఎస్ రామకృష్ణారావులు స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికి అందరిని గవర్నర్ కు పరిచయం చేశారు.
