నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:
మహత్మగాంది జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అధ్వర్యంలో స్వచ్చ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా స్వచ్చత హి సేవా ర్యాలీని నిర్వహించారు. బుదవారం ఉదయం నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ వద్ధ నిజామాబాద్ నగర మేయర్ దండు నీతుకిరణ్, నగర పాలక సంస్థ కమీషనర్ మంద మకరంధులు జండా ఉపి ప్రారంబించారు.
స్వచ్చ నిజామాబాద్- స్వచ్చ తెలంగాణా పేరిట ఈ ర్యాలిని నిర్వహించారు. అనంతరం గాంధి చౌక్ లోని మహత్మగాంధి విగ్రహనికి, తిలక్ గార్డేన్ చౌరస్తాలోని లాల్ బహదూర్ శాస్ర్తీ విగ్రహాలకు జయంతుల సంధర్బంగా పూలమాలలు వేసి శ్రద్ధంజలి ఘటించారు.
