నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మాల మహానాడు నిజామాబాద్ జిల్లా అధ్యక్షునిగా చొక్కం దేవిదాస్ ఎన్నికయ్యారు. మాల మహానాడు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తాజా మాజీ అధ్యక్షులు ఆనంపల్లి ఎల్లయ్య తెలిపారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్ల నాగరాజు, టీజీఓ జిల్లా అధ్యక్షులు అలుక కిషన్, దయానంద్, స్వామిదాస్ ఆధ్వర్యంలో ఎన్నకున్నట్లు పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షులుగా చొక్కం దేవిదాస్, ప్రధాన కార్యదర్శిగా నాంది వినయ్ కుమార్, కోశాధికారిగా రాజన్నతో కూడిన 30మంది కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు తెలిపారు.

