27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆడుకుంటూ వెళ్లి కుంటలో పడి చిన్నారుల మృతి

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో విషాదం

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వర పల్లి శివారులో గల పల్లె వారి కుంటలో మంగళవారం విషాదం నెలకొంది. సైకిల్  తొక్కుతూ ఆడుకుంటూ వెళ్లి పల్లెవారి కుంటలో ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులు నీటమునిగి  మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రంలోని గ్రీన్ సిటీలో నివాసం ఉండే చిన్నారులు సంతోష్ (10), శివ(10), లు ఇంటి ముందర ఆడుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో సైకిల్ తొక్కుకుంటూ సమీపంలో గల పల్లె వారి కుంట వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు కుంటలో పడి నీటమునిగి మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article