బతుకమ్మ భిక్కనూరు: మాట మరచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అత్తేలిశ్రీనివాస్ అన్నారు. మాజీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆదేశానుసారం రైతులకు రైతు భరోసా 15000 ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో 12000 మాత్రమే రైతు భరోసా ఇస్తామని అది కూడా వ్యవసాయ భూములకు మాత్రమే ఇస్తామని చెప్పి మాట మరచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుకు నిరసనగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో భిక్కనూరు మాజీ సర్పంచ్ తునికి వేణు రామచంద్రం బాపురెడ్డి చంద్రం మాజీ ఎంపీటీసీ స్వామి రవి కార్యకర్తలు పాల్గొన్నారు.
