ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి ఫారెస్ట్ ఎఫ్ఆర్ఓ ఇంచార్జిగా చరణ్ తేజ్ శనివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. చరణ్ తేజ్ ప్రస్తుతం కామారెడ్డి మొబైల్ పార్టీ ఫారెస్ట్ ఎఫ్ఆర్ఓ గా విధులు నిర్వహిస్తున్న చరణ్ తేజ్ కు ఎల్లారెడ్డి ఎఫఆర్ఓ బాధ్యతలు అప్పగించారు. ఎఫ్ఆర్ఓ ఓంకార్ ను సస్పెండ్ చేయడంతో ఈయన స్థానానికి జిల్లా అటవీశాఖ ఉన్నతధికారుల ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి రేంజ్ అటవీశాఖ అధికారిగా ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. బాధ్యతలు తీసుకున్న చరణ్ తేజ్ ఎల్లారెడ్డి రేంజ్ పరిధిలోని అధికారులు, సిబ్బందితో పట్టణంలోని అటవీ శాఖ కార్యాలయంలో రివ్యూ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..అటవీ భూముల పరిరక్షణకు కృషి చేస్తానని అన్నారు.
