నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఆర్ఎంపీల ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబద్ లో నిర్వహించే గ్రామీణ వైద్యుల ఆత్మగౌరవ సభ పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జిల్లా నుంచి ఆర్ఎంపీ, పీఎంపీ సభ్యులు తరలిరావాలని పిలపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు రవి వర్మ, జాయింట్ సెక్రెటరీ రాములు, కార్యదర్శి గోపి, మండల అధ్యక్షుడు సత్యనారాయణ, కార్యదర్శి వహీద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అశ్వక్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.