నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నూతన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామక ప్రక్రియకు ఏఐసీసీ ఇంఛార్జిగా తెలంగాణాకు చెందిన మాజీ శాసనసభ్యులు, సి.డబ్ల్యూ.సి ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డిని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నియమించారు.
