కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా వివిధ ప్రభుత్వం పాఠశాలలో ఉపాధ్యాయులకు జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా 41 మంది ఉపాధ్యాయులు ఎంపికైనట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. సంబంధిత విషయం బోధనలో విద్యార్థులకు తనదైన శైలిలో ఆధునిక బోధన తో వినూత్నంగా విద్యార్థులకు ఆకట్టుకునే విధంగా సులభంగా, అర్థమయ్యే విధంగా బోధిస్తున్నారు. జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైనటువంటి ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్, అదనపు కలెక్టర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు లా చేతుల మీదుగా ఉపాధ్యాయులకు ప్రశంస పత్రం ఇచ్చి శాలువాతో సత్కరించారు.
