మద్నూర్ బతుకమ్మ: శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం వద్ద సీసీ కెమెరాలు 7 కొత్తవి ఏర్పాటు చేశారు. మద్నూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం వద్ద సీసీ కెమెరాలు ఏడు(7) కొత్తవి బిచ్కుంద సీఐ రవికుమార్ మంగళవారం ప్రారంభించారు. ఒక సిసి కెమెరా 100 మంది పోలీసులతో సమానం అని గుర్తు చేశారు. సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను అరికట్టవచ్చని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మద్నూర్ ఎస్సై విజయ్ కొండ, కార్యాలయ సభ్యులు, తదితరులు ఉన్నారు.
