నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
పెర్కెట్ లోని పేకాట స్థావరంపై సీసీఎస్ టీం మెరుపు దాడి చేసారు. నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో సీసీఎస్ సిబ్బంది సోమవారం ఈ దాడిని నిర్వహించారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెర్కెట్, తిరుమల గాడిన్స్ ఫంక్షన్ హాల్ లో పేకాట స్థావరం పై రైడ్ చేసి ఆరుగురు పేకాట రాయుళ్ళను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 3 కార్లు, 6 సెల్ ఫోన్ లు, రూ.1,17,940 లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్య నిమిత్తం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ కి అప్పగించారు.
