ఆర్మూర్, బతుకమ్మ :
ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్సాపల్లి శివారులో పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసులు దాడులు నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ ఏ.సీ.పీ ఇంచార్జ్ మస్తాన్ ఆలి సూచనల మేరకు సిఐ డి.సాయినాథ్, ఎస్.ఐ గోవింద్, సిబ్బందితో కలిసి పేకాట స్థావరం పై రైడ్ చేశారు. ఈ దాడిలో 9 మంది పేకాట రాయుళ్ళు, 54,070 రూపాయలు నగదు, 10 సెల్ ఫోన్స్, మూడు కార్లను స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం ఆర్మూరు పోలీస్ స్టేషన్ ఎస్ హెచోవోకి అప్పగించినట్లు తెలిపారు.
