- నవీపేట్ ఎస్సై నవీన్
బతుకమ్మ, బోధన్: నిజాంబాద్ జిల్లా నవిపేట్ లో గణేష్ నిమజ్జన సందర్భంగా పోలీస్ నిబంధనలు అతిక్రమించి ముడు డిజేలు వాడిన వారిపై చర్యలు తీసుకున్నట్లు ఎస్సై నవీన్ తెలిపారు. అనుమతి లేకుండా డిజే పెట్టిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి, డిజే సిస్టమ్లను సీజ్ చేసినట్టు వెల్లడించారు. అలాగే, బైండోవర్ సమయంలో పూచికత్తుగా పెట్టిన రూ.3 లక్షల రూపాయలు జప్తు చేసినట్లు తెలిపారు. మద్యం తాగి న్యూసెన్స్ సృష్టించిన వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్సై నవీన్ మాట్లాడుతూ, పోలీస్ నియమ నిబంధనలు ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలి. లేనిపక్షంలో ఎటువంటి మినహాయింపు లేకుండా చట్టపరమైన చర్యలు తప్పవు” అని స్పష్టం చేశారు.

