హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ మెట్రోలో 300 కోట్ల బెట్టింగ్ స్కాం అంటూ యూట్యూబర్ అన్వేశ్ వీడియోలు చేశాడు. హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ప్రకటనల మీద వరుస వీడియోలు అన్వేశ్ చేశాడు. డీజీపీ, మెట్రో ఎండీ ఎన్వీఎస్ఎస్ రెడ్డితో పాటు మాజీ సీఎస్ శాంతికుమారి, ఐఏఎస్ల పై అన్వేశ్ వీడియో పోస్ట్ చేశాడు. బెట్టింగ్ యాప్ ప్రకటనలతో వారు రూ.300 కోట్లు కొట్టేశారని, తప్పుడు ప్రచారం చేశాడని అన్వేశ్ పై కానిస్టేబుల్ ఫిర్యాదు చేశాడు. సైబరాబాద్ పోలీసులు అన్వేశ్ పై సుమోటోగా కేసు నమోదు చేశారు.
