. . . ఏసీబీ కి చిక్కిన డీఐఈఓ
వెబ్ డెస్క్, బతుకమ్మ :
రూ.20,000 లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి (డీఐఈఓ) రామవత్ గోవింద్ రామ్ను ఏసీబీ అధికారులురెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో వికాస్ వొకేషనల్ జూనియర్ కాలేజ్’ గుర్తింపు (అఫిలియేషన్) పునరుద్ధరణకు అవసరమైన తాత్కాలిక గుర్తింపు గడువు పెంపు ప్రక్రియలో భాగంగా, తనిఖీ నిర్వహించి నివేదిక సమర్పించేందుకు డీఐఈఓ రూ, 50 వెల లంచం డిమాండ్ చేసారు. డీఐఈఓ మొదట రూ. 30,000 తీసుకున్నారు. బుధవారం తన కార్యాలయంలో మిగిలిన రూ. 20,000 తీసుకుంటుండగా ఆయన పట్టుబడ్డారు. ఆయన వద్ద ఉన్న లంచం సొమ్మును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సదరు అధికారిని అరెస్టు చేసి, ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.
