వెబ్ న్యూస్, బతుకమ్మ : మేడ్చల్ మల్కాజిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి బాంబు బెదిరింపు మొయిల్ కలకలం రేపింది. బాంబు పెట్టి కలెక్టర్ కార్యాలయాన్ని పేల్చి వేస్తామని, కలెక్టర్ ను చంపేస్తామని ఓ ఆగంతకుడు కలెక్టరేట్ కు మెయిల్ చేశాడు. ఈవిషయమై కలెక్టర్ గౌతం ఆదేశాలతో డీసీపీ పద్మజారెడ్డి మెయిల్ ఎక్కడ నుంచి వచ్చింది, ఎవరు పంపించారని అనే అంశంపై విచారణ చేస్తున్నారు. కరీంగనర్ కు చెందిన మావోయిస్టు లక్ష్మణరావు పేరిట మొయిల్ రాగా, అందులో చివరిగా అల్లాహు అక్బర్ అనే నినాదం ఉండటం గమనార్హం.
