బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని పెద్దమల్లరెడ్డి గ్రామంలో ప్రైమరీ పాఠశాలలో రక్తపు మరకలతొ నిండిపోయింది. వివరాలకు వెళితే గ్రామానికి చెందిన బైండ్ల పరశురాములు కుమారుడు ప్రశాంత్ ఇద్దరు గొడవ పడడంతో ఇంటి నుండి వెళ్లిపోగా ప్రైమరీ స్కూల్లోకి గోడ పైనుండి దూకడంతో బండ పైన పడటంతో కాలుకు బలమైన గాయం కావడంతో స్కూల్లోనే పడుకొని పొద్దున వెళ్లిపోయాడు స్కూల్ కి విద్యార్థులు ఉపాధ్యాయులు రావడంతో అక్కడ రక్తపు మరకలను చూసి ఏమైనా హత్య జరిగిందానే కోణంలో పోలీసువారికి ఉపాధ్యాయులు సమాచారం అందించగా పోలీసులు దర్యాప్తు చేసే క్రమంలో బాధ్యుడు రక్తపు మరకలతో ఇంట్లో ఉండగా వారిని అడిగి వివరాలు తెలుసుకోగా దెబ్బ తాకిందని జవాబు ఇచ్చాడు. చివరకు కథ సుఖాంతం అయింది.

