. పాలకవర్గాన్ని లోపలేసి తాళం వేసిన రైతులు
తాడ్వాయి, బతుకమ్మ: ఎన్నికల సందర్భంగా సీం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని తాడ్వాయి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్నిరైతులు దిగ్బంధించారు. చైర్మన్ కపిల్ రెడ్డి తోపాటు పాలకవర్గాన్ని భవనం లోపల వేసి తాళం వేశారు. రుణమాఫీ చేయకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని రైతులు హెచ్చరించారు.
