- జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బిసి రిజర్వేషన్ పైన తలతిక్క మాటలతో బీజేపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. నగరంలోని కాంగ్రెస్ భవన్ లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు ఆమోదం బీజేపీ ఎమ్మెల్యే లు తెలుపుతున్నారని, అసెంబ్లీ బయట బిసి బిల్లును బీజేపీ ఎంపీలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. బీజేపీ నాయకులు ద్వంద రీతి ప్రదర్శిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఖచ్చితంగా బిసి లకు 42 శాతం కల్పించి తీరుతామని స్పష్టం చేశారు. బిసి లకు న్యాయం చేయాలనే చితశుద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.
