బతుకమ్మ బాన్సువాడ : ఈనెల 17 నుంచి బేతల స్వామి జాతర ప్రారంభం కానుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ శ్రీహరి రాజు అధ్యక్షతన ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు సమావేశం నిర్వహించారు. గురువారం 17న ఎడ్లబండ్ల జాతర, 18న కుస్తీ పోటీలు ఉంటాయన్నారు. విజేతకు రూ. 11వేలు ఉంటుందన్నారు. మూడు రోజుల పాటు జాతర ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ మల్లికార్జున్, ఆలయ కమిటీ సభ్యులు ఎర్వల కృష్ణారెడ్డి, జంగం గంగాధర్, మాసాని శ్రీనివాస్ రెడ్డి, అంజిరెడ్డి,పోతు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
