వెబ్ న్యూస్, బతుకమ్మ : నిషేధిత ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లావాదేవీల్లో మనీలాండరింగ్ కు సంబంధించి నటుడు సోనూసూద్, మాజీ క్రికెటర్లు రాబిన్ ఉతప్ప, యువరాజ్ సింగ్ లకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈనెల 22న రాబిన్ ఉతప్ప, 23న యువరాజ్ సింగ్, 24న సోనూసూద్ విచారణకు హాజరుకావాలని నోటిసుల్లో పేర్కొంది. ఈకేసులో మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్ లను ఇటీవల ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. కాగా, ఇదే కేసులో మంగళవారం బెంగాళీ నటుడు అంకుశ్ హజ్రా ఈడీ ఎదుట హాజరయ్యారు.
