నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: సేంద్రియ వ్యవసాయ సాగుతో ఎన్నో లాభాలు తెస్తుందని రాష్ట్ర ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ అన్నారు. నగరంలోని న్యాల్కల్ రోడ్ లో సేంద్రియ సాగు చేస్తున్న ఆకుల పాపయ్య వ్యవసాయ క్షేత్రాన్ని కమిషన్ సభ్యుడు గడు గంగాధర్ ముదక్ పల్లి రైతులతో కలిసి సందర్శించారు. వ్యవసాయంలో రెట్టింపు లాభాలకు సేంద్రియ సాగు ఎంతో ఉపయోగపడుతుందని ఆరోగ్యకరమైన వ్యవసాయ ఉత్పత్తులు కూడా లాభాలు తెచ్చిపెడతాయని అన్నారు.

