మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండలంలోని దొనకల్, గాండ్లపెట్ గ్రామాల మధ్య పెద్దవాగుపై నిర్మించిన చెక్ డ్యాం నాసిరకంగానిర్మించడం వలన ఇటీవల కురిసిన వర్షాలకు వరద ప్రవాహం అధికంగా రావడం వలన పూర్తిగా కొట్టుకుపోవడం జరిగిందిని విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి పరిశీలించడం జరిగింది. కార్యక్రమంలో మోర్తాడ్ మండల అధ్యక్షులు ముత్యాల రాములు, డిసిసి ఉపాధ్యక్షులు శివకుమార్, ఎరుగట్ల అధ్యక్షులు దేవ రెడ్డి రొక్కం మురళి, ఆనంద్, అనిల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మహిపాల్ రంజిత్, నవీద్, అర్గుల్ రమేష్, దేవేందర్, రాజశేఖర్, గంగారెడ్డి, నంద గౌడ్, ఎర్రం శీను, జెడి చిన్న గంగారం, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.
